చాలామంది ఉదయంనుండి సాయంత్రం వరకు ఆఫీసుల్లో పనిచేసి అలసిపోతూంటారు. తాము చేసే ఆఫీస్ పనిపై ఎన్నో ఫిర్యాదులు చేస్తూంటారు. ఆఫీసు పనికి అయిష్టం చూపుతారు. అయితే, తాజాగా సైంటిస్టులు వీరిపై అధ్యయనం చేశారు. 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ కార్యాలయాలకు వెళ్ళి పని చేసే వారికి ఇచ్చినట్లయితే, వారు అలసిపోరని, వారు చేసే పనిపై మరింత ఇష్టాన్ని కూడా చూపుతున్నారని పరిశోధన తెలిపింది. దానిమ్మ గింజల రసాన్ని షుమారుగా రెండు వారాలపాటు నిరంతరంగా వీరికి అందించారని తెలిసింది.
రెండు వారాల తర్వాత వారు కార్యాలయ పని అంతా పూర్తయిన తర్వాత వారికి ఒక ప్రశ్నా పత్రం అందించారు. అందులో చాలామంది ఉద్యోగులు వారు చాలా హేపీ భావిస్తున్నట్లుపని ఒత్తిడి భావించకుండా వున్నట్లు, చురుకుగాను, ఎంతో గర్వంగాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రీసెర్చిని ఒక పోమోగ్రానేట్ జ్యూస్ కంపెనీ నిర్వహించింది అంతే కాదు, పరీక్షలు చేయిస్తే పని సమయంలో వారి పల్స్ రేట్ సైతం పెరగకుండా ఎంత వుండాలో అంతేవుందట.
ఫలితంగా పరిశోధకులు వర్కర్లు లేదా ఉద్యోగులు, తీవ్ర ఒత్తిడినుండి దూరమవాలంటే, పోమోగ్రానైట్ జ్యూస్ తాగమని సలహాలిచ్చారట. ఒత్తిడే కాదు దీనివలన గుండెతో సహా ఆరోగ్యానికి ఇతర ప్రయోజనాలు ఎన్నో వున్నాయని కూడా క్వీన్ మార్గరెట్ యూనివర్శిటీలోని రీసెర్చి లీడర్ డా. ఎమాద్ అల్ దుజైలి తెలిపినట్లు డెయిలీ మెయిల్ వార్తా పత్రిక పేర్కొంది. ఎన్నో ప్రయోజనాలను అందించే దానిమ్మ రసానికి ఒత్తిడి అనే కొద్దిపాటి లేదా కొద్దిపాటి ప్రయోజనాలు మాత్రమే ఆపాదించటం సరికాదని తాము భావిస్తున్నట్లుగా కూడా రీసెర్చర్లు తెలిపారు.