1999 మే 5 న అయిదుగురు భారత సైనికులను బంధించి, వారిని చిత్ర హింసలు పెట్టి చంపారు పాక్ సైనికులు..అక్కడి నుండి మొదలైన పోరాటం. చివరకు కార్గిల్ వార్ తో ముగిసింది. ఈ వార్ లో ఇండియా విజయం సాధించింది. అయితే ఈ వార్ గురించి చెప్పుకున్నప్పుడల్లా…ఓ మహావీరుడిని, గుండె నిబ్బరం దండిగా ఉన్న ధీశాలిని , భారతమాత కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన అసలు సిసలు భారత సైనికుడిని స్మరించి తీరాల్సిందే.. ఆ వీర సైనికుడి పేరు డిజేంద్ర కుమార్. రాజస్థాన్ లోని జాలారా గ్రామంలో పుట్టిన డిజేంద్ర… దేశ సేవ చేయాలని యవ్వన ప్రాయం నుండే ఉవ్విళ్లూరేవాడు. అదే లక్ష్యంతో ఇండియన్ ఆర్మీలో చేరాడు. ఆరు అడుగలకు పైగా ఎత్తున్న మనిషి, ఉక్కులా ఉండే దేహం… అన్నింటికి మించి దేశం కోసమే నా ఈ జీవితం అనే తెగువ… అతడి బ్యాచ్ మేట్స్ అందరూ అతడిని ముద్దుగా కోబ్రా అని పిలుచుకునే వారు. ఇతను రాజ పుతానా అనే బెటాలియన్ కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇతని సారథ్యంలోని రాజపుతానా బెటాలియన్ శ్రీనగర్ లో ఓ ఆపరేషన్ పనిలో బిజీగా ఉంది.
ఇది ఇలా ఉండగా….. మే 15 నుండి కాశ్మీర్ ప్రాంతమంతా బాంబులతో దద్దరిల్లుతుంది. పాక్ సేన దాడులతో విరుచుకుపడుతుంది. భారత సైన్యం కూడా దానికి ధీటుగానే సమాధానం చెబుతుంది. రోజులు గడుస్తున్నా కొద్ది పాక్ బలగాలు తన స్ట్రాటజీ ని మార్చుకుంటూ ముందుకు కదులుతున్నాయి జూన్ 11 నాటికి మొత్తం 11 బాంబింగ్ ట్యాంకర్ల సహాయంతో 15000 అడుగుల ఎత్తులో ఉన్న ద్రాస్ సెక్టారులోని 4590 పాయింటును స్వాదీనం చేసుకున్నాయి. భారత సైనిక అధికారులందరూ టెన్షన్ లో ఉన్నారు. ద్రాస్ సెక్టార్ ప్రాంతం పాక్ సైనిక చేతుల్లోకి వెళ్లిపోయిందనే టెన్షన్ ప్రతి ఒక్కరి ముఖంలో కనిపిస్తుంది. ఇక లాభం లేదనుకున్న ఇండియన్ అధికారులు అన్ని అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నారు. ఇంతలోనే శ్రీనగర్ లో ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చిన డిజేంద్రకు ద్రాస్ సెక్టార్ ను తిరిగి స్వాధీనం చేసుకునే బాధ్యతను అప్పజెప్పారు.
తన రాజ్ పుతానా బెటాలియన్ తో అటువైపుగా పయనం స్టార్ట్ చేశాడు డిజేంద్ర….ముందుగా అక్కడున్న 11 బంకర్లలో మొదటి దానిని, చివరి దానిని తాను పేల్చేస్తానని, మిగితా వాటి పని మీరు పట్టండని తన సహచరులకు ఆదేశాలు జారీ చేసి..అనుకున్నట్టుగానే 1వ,11 వ పాక్ బంకర్లను పేల్చేశాడు డిజేంద్ర…. మిగితా బంకర్ల టార్గెట్ వీరి వైపుకు మళ్లింది…అటు నుండి బాంబులు శరవేగంగా దూసుకు వస్తున్నాయ్.ఈ బెటాలియన్ లోని అయిదుగురు సైనికులు అవతలి వారికి చిక్కారు…..ఈ క్రమంలో శత్రువుల చేతిలో చావడం కంటే ఆత్మహత్యే శరణ్యమని భావించిన వారు.. వారికి వారే పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి కాల్చేసుకున్నారు.
ఇదంతా గమనిస్తున్న కోబ్రా….ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఓ లైట్ మెషిన్ గన్ ను తీసుకొని పాక్ బంకర్లే టార్గెట్ గా అటువైపుకు దూసుకుపోతున్నాడు. అంతలోనే ఓ బుల్లెట్ వచ్చి అతని ఎడమ భుజాన్ని చీల్చుకుంటూ వెళ్లింది అయినా… డిజేంద్ర వెనక్కి తగ్గలేదు. అడుగులో అడుగు వేసుకుంటూ పాక్ బంకర్లనే టార్గెట్ చేసుకుంటూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు 48 మంది పాక్ సైనికులను మట్టుబెట్టాడు. మరో విషయం ఏంటంటే…కొంత మందిదో అయితే గన్ లతో కాకుండా డైరెక్ట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేసి మరీ వారి పని పట్టాడు. ఫైనల్ గా జూన్ 13, 1999 న పాక్ ఆక్రమించిన ద్రాస్ సెక్టారులోని 4590 పాయింటును తిరిగి స్వాధీనం చేసుకొని అక్కడ మన మువ్వన్నెల జెండాను నిలబెట్టి సెల్యూట్ కొట్టి అక్కడే పడిపోయాడు..ఆ పాటికే అతని శరీరంలోకి 18 బుల్లెట్లు చొచ్చుకుపోయాయి.ఇతని అత్యున్నత స్థాయి పొరాటానికి గుర్తుగా అప్పటి వాజపాయ్ ప్రభుత్వం డిజెంద్ర సింగ్ ను ఆగస్ట్ 15, 1993 న మహావీర చక్ర అవార్దుతో గౌరవించింది.