సీమా హైదర్ పేరు తెలియని వారుండరు. ప్రియుడిని కలిసేందుకు ఇండియాకు వచ్చిన ఓ పాక్ మహిళ యూట్యూబ్ ద్వారా పెద్ద మొత్తంలో సంపాదిస్తోంది. సీమా తన ఆదాయ రహస్యాన్ని పంచుకుంది. పబ్జీ గేమ్ ద్వారా పెళ్లి కాని ఓ యువకుడితో ప్రేమలో పడిన పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ భర్తను వదిలి అక్రమంగా ఇండియాకు చేరుకోవడమే కాకుండా ప్రియుడు సచిన్ మీనాను పెళ్లాడింది. వీరి లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్పై గతంలో కథలు కథలుగా మీడియాలో, సోషల్ మీడియాలో నిత్యం వస్తూ ఉండేవి. అలాంటి పాకిస్థాన్ మహిళ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ భర్త సచిన్ మీనాతో వీడియోలు, షార్ట్లను అప్లోడ్ చేస్తుంది. అవి కాస్తా వైరల్గా మారడంతో ఈ వెరైటీ లవర్స్ బాగా పాపులర్ అయ్యారు. వీళ్లు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్కి ఆదాయం కూడా ఊహించని రీతిలో పెరిగింది. రీసెంట్గా సీమా తనకు యూట్యూబ్ ద్వారా నెలవారి వస్తున్న ఆదాయాన్ని కూడా ఓపెన్గా అందరితో షేర్ చేసుకుంది.
యూట్యూబ్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో సీమా హైదర్కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న సంగతి తెలిసిందే. యూట్యూబ్ ద్వారా తనకు మంచి ఆదాయం వస్తోందని సీమ హైదర్ ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. సోషల్ మీడియా ద్వారా సీమా, సచిన్ ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం. సోషల్ మీడియా ద్వారా తన మొదటి ఆదాయం రూ. 45,000 అని సీమా చెప్పారు. ఇది క్రమంగా పెరుగుతూ వచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఫాలోవర్ల సంఖ్య పెరగడంతో ఆదాయం కూడా బాగా పెరిగింది. యూట్యూబ్లో ప్రతి 1,000 వ్యూస్కి ఎంత డబ్బు వస్తుందో సీమా వెల్లడించింది. ఇది పూర్తిగా శ్రమపై ఆధారపడి ఉంటుందని ఆమె చెబుతోంది. భర్త సచిన్తో కలిసి షేర్ చేసిన, రూపొందించిన చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. వాటి ద్వారానే కొంత ఆదాయాన్ని పొందుతున్నామని తెలిపింది.
5 నిమిషాల వీడియోకు 1,000 వ్యూస్ వస్తే దాదాపు 25 రూపాయలు ఆదాయం వస్తుంది. యూట్యూబ్ షార్ట్లను పోస్ట్ చేయడం ద్వారా 1 లక్ష వ్యూస్కి దాదాపు $1 (సుమారు రూ. 83-84) సంపాదిస్తారు. బ్రాండ్ ప్రమోషన్, ప్రకటనల ద్వారా కూడా సంపాదిస్తున్నట్లు సీమ తెలిపింది. సీమా హైదర్ YouTube నుండి నెలకు కనీసం రూ. 80,000 సంపాదిస్తుంది. ఆమె భర్త సచిన్ మీనా వారి యూట్యూబ్ ఛానెల్లో 1.7 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లను కలిగి ఉన్నారు. అతని వీడియోలకు కనీసం 25 వేల వ్యూస్ వస్తుంటాయి. సీమ ఇండియాకి వచ్చినప్పటి నుండి ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఫాలోవర్లు పెరిగే కొద్దీ తన ఆదాయం కూడా పెరిగిందని చెప్పారు. యూట్యూబ్ నుండి తమ ఖర్చులు తేలికగా వెళ్లిపోతున్నందున ఇప్పుడు సచిన్ పని చేయడం లేదని సీమా తెలిపింది. సీమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పిల్లల చదువులు, భవిష్యత్తు ప్రణాళికలపై పెట్టుబడి పెడుతోంది.